Wednesday, April 24, 2024

ఇండియాకి రానున్న ఫేమస్ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్.. ఢిల్లీలో షో ఎప్పుడంటే..

“బేబీ”, “సారీ”, “ఘోస్ట్”, “లోన్లీ” వంటి ట్రాక్‌లతో పేరుగాంచిన కెనడియన్ సింగ‌ర్‌ జస్టిన్ బీబర్ తన వరల్డ్ టూర్‌లో భాగంగా న్యూఢిల్లీకి రానున్నారు. మే 2022 నుంచి మార్చి 2023 వరకు 125 కంటే ఎక్కువ షోలను ప్లే చేస్తూ.. 30కి పైగా దేశాలలో ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకున్నాడు జేబీ. అత‌ని ప‌ర్య‌ట‌న ఈ నెల మెక్సికోలో ప్రారంభమైంది.. ఇటలీలో జ‌రిగే ఆఖ‌రి ప్రోగ్రామ్ తో జులైలో ముగుస్తుంది.. ఆగస్ట్‌లో స్కాండినేవియాలో పర్య‌టించి ఆ తర్వాత అక్టోబర్‌లో దక్షిణఅమెరికా, దక్షిణాఫ్రికా, భారతదేశంలో ప‌ర్య‌టిస్తారు జ‌స్టిన్ బీబ‌ర్.

కాగా, అక్టోబర్ 18న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జేఎల్‌ఎన్ స్టేడియం)లో కచేరీ జరగనుంది. ఈ క‌చేరికి సంబంధించిన‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. జూన్ 2న ప్రీ-సేల్ విండో తెరవడంతో పాటు, జూన్ 4 నుంచి బుక్‌మైషోలో ఈ షో టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. టిక్కెట్ల ధర దాదాపు 4వేల రూపాయ‌ల నుంచి స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement