Wednesday, April 24, 2024

అమ‌లాపురం అల్ల‌ర్ల కేసులో నిందితుడు అరెస్టు..

కోనసీమ జిల్లా పేరు మార్పుపై రేగిన‌ వివాదం జిల్లా కేంద్ర‌మైన‌ అమ‌లాపురంలో జ‌రిగ‌న అల్ల‌ర్లు సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో కీల‌క నిందితుడిగా భావిస్తున్న అన్యం సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోన‌సీమ జిల్లా పేరును డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్చాలంటూ జిల్లాకు చెందిన ద‌ళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో జిల్లా పేరును మార్చొద్దంటూ అన్యం సాయి ఆందోళ‌న‌కు దిగాడు.

ఈ క్ర‌మంలో జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేత‌బ‌ట్టిన అన్యం సాయి వీడియోలు ప్ర‌స్తుతం న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు నేతృత్వం వ‌హించాడంటూ పోలీసులు అనుమానిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ అల్ల‌ర్ల‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌పై అత‌డిని విచారిస్తున్నారు ఏపీ పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement