Tuesday, May 7, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.35కోట్లు

భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న కానుక‌ల ద్వారా తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.35కోట్లు వ‌చ్చింద‌ని టిటిడి అధికారులు తెలిపారు. కాగా శ్రీవారిని నిన్న 56,958 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నేటి నుంచి అంగప్రదక్షణం భక్తులకు టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement