Thursday, May 2, 2024

CM KCR: ప్రగతి భవన్‌లో ఉగాది సంబురాలు

శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు బగా పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పాలన పరంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆయన పంచాంగ పఠనంలో చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement