Sunday, May 5, 2024

Breaking | త్వరలోనే ఎన్నికల నగారా.. అంతా సిద్ధం చేసుకుంటున్న ఎలక్షన్​ కమిషన్​

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారధ్యంలో ఎన్నికల కమిషనర్లు, అధికారులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో మిజోరంలో కూడా ఈసీ అధికారుల పర్యటిస్తారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పర్యటించి.. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

కాగా, వచ్చే అక్టోబర్-నవంబర్‌లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 17తో మిజోరం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలోని పలు తేదీలతో గడువు ముగుస్తుంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement