Thursday, May 2, 2024

సోన‌మ్ క‌పూర్ కి.. బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి ఆహ్వానం

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ సూప‌ర్ ఛాన్స్ కి కొట్టేసింది.బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించింది ఈ బ్యూటీ. కాగా సినిమాలు తగ్గించి 2018 లో పెళ్లి చేసుకుని..ఫ్యామిలీతో లండన్ లో ఉంటోంది. పెద్దగా సినిమాలవైపు చూడటంలేదు. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ లో యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌తో కనిపించి సందడి చేసింది బ్యూటీ. ఆ ఫోటోలు కూడా నెట్టింట గా వైరల్ అయ్యాయి. ఇక ఇఫ్పుడు ఆమెకు అరుదైన అవకాశం లభించినట్టు తెలుస్తోంది. తాజాగా సోనమ్ కపూర్.. బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. మే 6 నుంచి 8వ తేదీ వరకు పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. పట్టాభిషేకం అయిన తరువాత రోజు జరిగే కార్యక్రమంలో హాలీవుడ్‌ స్టార్స్ తో పాటు సోనమ్‌ కపూర్‌ కూడా హాజరయ్యి సందడి చేయనుంది.దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు రానున్న ఈ వేడుకలకు ఇండియా నుంచి సోనమ్ కు మాత్రమే ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆహ్వానం గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ..అటువంటి చారిత్రాత్మక కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం నాకు దక్కిన గౌరవం. ఛార్లెస్‌ 3 పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement