Friday, April 19, 2024

మైల్ స్టోన్ అందుకున్న ర‌ష్మిక‌.. ఇన్ స్టాలో 38మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్

సోష‌ల్ మీడియాలో సినీ సెల‌బ్రిటీల‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. కాగా హీరోయిన్ రష్మిక మంద‌న ఖాతాలో అరుదైన మైల్ స్టోన్‌ చేరిపోయింది. రష్మిక మందన్నా ఇన్‌ స్ట్రాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 38 మిలియన్లు దాటింది. దీంతో ఈ మైల్‌ స్టోన్‌ అందుకున్న వారి జాబితాలో వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ సెలబ్రిటీగా నిలిచింది. రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్‌ పుష్ప.. ది రూల్‌తోపాటు ఫీ మేల్ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న రెయిన్‌ బోలో నటిస్తోంది రష్మిక. రెయిన్‌ బో సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. వీటితోపాటు బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ యానిమల్‌లో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు భీష్మ తర్వాత టాలీవుడ్ యువ హీరో నితిన్‌, యువ దర్శకుడు వెంకీకుడుముల కాంబినేషన్‌లో రెండోసారి వస్తోన్న VNRTrio (వర్కింగ్ టైటిల్‌) లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement