Friday, May 3, 2024

చెన్నైసూప‌ర్ బ్యాటింగ్ .. 200/4… పంజాబ్ టార్గెట్ 201 ప‌రుగులు

చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మ‌ధ్య జరుగుతున్న మ్యాచ్ లో సిఎస్కే నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. పంజాబ్ గెల‌వాలంటే 201 ప‌రుగుల చేయాల్సి ఉంది… కెప్టెన్ ధోని ఆఖరి రెండు బాల్స్ లో రెండు సిక్స్ లు కొట్టి తనలో ఇంకా సత్తా ఉందని చాటాడు.. టాస్ గెలిచిన సిఎస్కే బ్యాటింగ్ కు దిగింది.. ఓపెనర్ రుతురాజ్ 37 పరుగులు, శివం డూబే 28, మోయిన్ అలి 10, జడేజా 12 పరుగులు చేసి అవుటయ్యారు.. మరో ఓపెనర్ కాన్వే 92, కెప్టెన్ 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.. సికిందర్ రజా, కరన్, అర్షదీప్, చావర్ లు తలో వికెట్ పడగిొట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement