Monday, April 29, 2024

Virginia : వర్జీనియాలో కాల్పులు.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. హ్యూగెనాట్‌ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం జరిగింది. అనంతరం స్కూలు సమీపంలో ఉన్న మన్రో పార్కులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో 18, 36 ఏండ్ల వయస్కులు ఉన్నట్లు వర్జీనియా సిటీ పోలీస్‌ చీఫ్‌ రిక్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు. హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్‌మండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారి మాథ్యూ స్టాన్లీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement