Wednesday, May 1, 2024

టీడీపీ సీనియ‌ర్ నేత‌..బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

గుండెపోటుకి గుర‌య్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ . తీవ్ర అస్వస్థతకు గురైన రాజేంద్రప్రసాద్‌ను కుటుంబసభ్యులు విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేశారు. దాంతో, ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రాజేంద్రప్రసాద్‌కు యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్న రాజేంద్రప్రసాద్‌ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement