Sunday, April 28, 2024

షాక్​ మీద షాక్​.. యువకుడి ఖాతాలో 5.68 కోట్లు జమ, 7 గంటల్లో మళ్లీ మాయం

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఖాతాదారులు ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నారు. తమ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయంటే.. తమ అకౌంట్లలో పైసలు వచ్చినయని చెప్పుకుంటూ స్ట్రీన్​షాట్లను షేర్​ చేసుకుంటున్నారు.ఇట్లాంటిదే ఓ ఘటన కరీనంగర్​ జిల్లాలో జరిగింది. ఓ యువకుడి ఖాతాలో 5 కోట్ల 68లక్షల రూపాయలు జమవ్వడంతో ముందు సంతోషించినా.. ఆ తర్వాత షాక్​కి గురయ్యాడు. అంత పెద్ద మొత్తం తనకు ఎక్కడినుంచి వచ్చిందో తెలియక జుట్టుపీక్కున్నాడు. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు ఉండలేదు.. ఆ తర్వాత 7 గంటల్లో మొత్తం డబ్బులు మాయమయ్యాయి.

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జరిగింది.. మంథనికి చెందిన మొబైల్‌ షాపు యజమాని సాయి తన బ్యాంకు ఖాతాలోకి ఆదివారం రాత్రి 5కోట్ల 68లక్షల రూపాయలు జమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో నగదు జమ కావడంతో ఖంగుతిన్న సాయి బ్యాంకు అధికారులను సంప్రదించాలని భావించినా ఆదివారం కావడంతో వీలు కాలేదు. ఖాతాలో జమైన డబ్బులు ఏడు గంటల్లో తిరిగి మాయమై పోవడంతో సోమవారం సాయి బ్యాంకుకు వెళ్లి సదరు లావాదేవీ గురించి అధికారులకు వివరించాడు. సాంకేతిక కారణాల వల్ల అలా జరిగి ఉండవచ్చని బ్యాంకు అధికారులు చెప్పినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement