Wednesday, May 15, 2024

జూన్‌2 నుంచి తెలంగాణ‌లో క్రికెట్ టోర్నీ..

హైదరాబాద్‌ : జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ.. “సే నో టు డ్రగ్స్‌” అనే నినాదానికి మద్దుతుగా నిలుస్తున్నది. జూన్‌ 2న ప్రారంభమ‌య్యే ఈ మ్యాచ్ 2 రోజుల పాటు నిర్వహిస్తారు. 3వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ టోర్నీలో అత్యంత మెరుగైన ప్రతిభ కనబర్చిన క్రీడాకారుడికి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ను బహూకరించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement