Monday, April 29, 2024

మహిళా ఎంపీతో శశిథరూర్​ చిట్​చాట్​.. సోషల్​ మీడియాలో బాగానే ఏస్కుంటున్న‌రుగా! (వీడియో)

పొలిటీషియన్స్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వారిపై కెమెరాలు ఫోకస్ పెడుతుంటాయి. ముఖ్యంగా చట్టసభల్లో ఉన్నప్పుడు ఆ ఫోకస్ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇక పార్లమెంట్​లో సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం లాంటివి అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ ఓ ఇన్సిడెంట్​తో ఇవ్వాల మొత్తం సోషల్‌ మీడియా ట్రెండ్​ అవుతున్నారు. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ఆయన మాట్లాడటమే దీనికి కారణం. కాగా, దీనిపై సోష‌ల్‌మీడియాలో స‌ర‌దా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే.. రష్యా–ఉక్రెయిన్ వార్​పై సభలో జమ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో థరూర్‌ మాట్లాడుతూ కనిపించారు. ముందుసీటులో ఆమె కూర్చొని ఉండగా శశిథరూర్‌ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి ముచ్చటించారు.

ఓవైపు ఫరూక్‌ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా.. మరోవైపు థరూర్‌ ఫన్నీగా ఆమెతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ ఘటనపై శశి థరూర్ కూడా స్పందించారు. ఫరూక్ అబ్దుల్లా తర్వాత సుప్రియా మాట్లాడాల్సి ఉందని.. అయితే ఆమెకు పాలసీకి సంబంధించిన ప్రశ్నల్ని అడిగేందుకే తనతో మాట్లాడారన్నారు. అలాగే ఫరూక్ అబ్దుల్లా ప్రసంగానికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఆమె నెమ్మదిగా మాట్లాడారని థరూర్ ట్వీట్ చేశారు.


దీంతో ఆమె మాటల్ని వినేందుకు.. బల్లపై తలను ఆనించాల్సి వచ్చిందన్నారు. మరో ట్వీట్ లో వెటరన్ యాక్టర్లు రాజేశ్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన అమర్ ప్రేమ్ సినిమాలోని ‘కుచ్ తో లోగ్ కహేంగే, లోగోన్ కా కామ్ హీ కెహ్నా’ (ఎవరో ఏదోటి అంటుంటారు.. వారి పనే ఏదోటి అంటూండటం) అనే పాట లిరిక్స్ ను ఆయన షేర్ చేశారు. ఈ ట్వీట్ కు సుప్రియా సూలేను ట్యాగ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement