Saturday, April 27, 2024

షేక్ పేట్ ఫ్లై ఓవర్ పనులు కంప్లీట్‌.. త్వరలోనే ప్రారంభం

షేక్ పేట దగ్గర నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు కంప్లీట్ అయ్యాయి. రేతిబౌలి నుండి గచ్చిబౌలి దాకా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. రెండు 6 లేన్ల ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్, ఫిలింనగర్ జంక్షన్, ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని. త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీ ఆర్ ట్వీట్ చేశారు.

రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ అయ్యియి. 74 పిల్లర్లు, 440 పీఎస్సీ గ్రీడర్స్, 144 కాంపోసిట్ గ్రీడర్స్, 73 స్లాబ్ ల నిర్మాణం కూడా పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement