Monday, April 29, 2024

RBL బ్యాంకులో కీలక పరిణామం.. కొత్త డైరెక్టర్ ను నియమించిన ఆర్బీఐ

ముంబై కేంద్రంగా నడిచే ఆర్బీఎల్(RBL) బ్యాంకులో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్‌బిఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ విశ్వవీర్ అహుజా ఆ పదవి నుండి వైదొలిగారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రాజీవ్ అహుజాను తాత్కాలిక ఎండీ, సీఈవోగా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. తక్షణమే సెలవుపై వెళ్లేందుకు అనుమతించాలన్న విశ్వవిర్ అహుజా అభ్యర్థనను మన్నించినట్టు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కె దయాల్‌ను RBL బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా నియమించింది. దయాళ్ ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఇప్పటి వరకు పనిచేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement