Monday, April 29, 2024

తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌భాష్ మిథు – ట్రైల‌ర్ రిలీజ్

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళింది హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్ లో త‌న స‌త్తా చాటుతోంది. లేడీ ఒరియెంట్ చిత్రాల‌తో దుమ్ము రేపుతోంది. కాగా తాప్సీ ప్ర‌ధాన పాత్ర పోషించిన శ‌భాష్ మిథు ట్రైల‌ర్ రిలీజ్ అయింది..వచ్చే నెల 15న సినిమా విడుదల కానుంది.వయాకామ్‌ 18 స్టూడియోస్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో..క్రికెటర్ గా ఎదగడానికి చిన్న నాటి నుంచి మిథాలీ రాజ్ పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం మిథాలీ రాజ్ ఎంత కష్టపడిందనేది సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనే టీమ్..గురించి తాప్సీ చెప్పిన డైలాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం తాప్సీ ఎంత కష్టపడిందనేది వెండితెరపైన స్పష్టంగా కనబడబోతున్నది. ఇప్పటికే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాపైన అంచనాలు భారీగా పెరిగాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement