Saturday, April 20, 2024

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

మహబూబాబాద్ : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సోమ‌వారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వ‌హించారు. చిన్నారుల‌చేత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ విద్య‌నందించేందుకు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు. బ‌డీడు పిల్ల‌లంద‌రూ బ‌డిలో చేరి విద్య‌న‌భ్య‌సించాల‌న్నారు. విద్య‌తోనే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌వ‌చ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement