Wednesday, May 15, 2024

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు స్వల్ప అస్వస్థత

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్‌ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది.

స్టాలిన్‌ పర్యటనకు అధికారులు, డీఎంకే నేతలు భారీగా ఏర్పాట్లు చేపడుతున్న తరుణంలో ఆయన జ్వరంతో అస్వస్థత చెందారన్నారు. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్‌ తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో పర్యటన తేదీలను మళ్లీ ప్రకటిస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement