Saturday, May 4, 2024

సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ వాట్సాప్ చాట్

చికోటి ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్ సంచలనం రేపుతోంది. వాట్సాప్ లో చికోటితో ప్రజాప్రతినిధులు చాటింగ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 20మంది ప్రజాప్రతినిధులతో చికోటికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. చికోటి నిర్వహించిన క్యాసినోకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. చికోటికి టచ్ లో ఉన్న12మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే 20మందికి పైగా వీఐపీలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అయితే చికోటి వాట్సాప్ చాట్ ను ఈడీ రికవరీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement