Monday, May 6, 2024

ప్ర‌పంచంలోనే రెండో విష‌పూరిత‌మైన ‘చేప’

చేప‌ల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చూస్తోన్న ఈ చేప కూడా అలాంటిదే. చూడ‌టానికి భయనకంగా, రాక్షసంగా ఉంది.. ఈ చేప నిజంగానే చాలా డేంజర్ అట‌. మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్న ఈ చేపను బొంక చేపని పిలుస్తారు. బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. నార్మల్‌గా నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపలానే ఉంటుంది. కానీ ఎవరైనా పట్టుకున్నా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఈ బొంక చేప వలలో పడింది. దీని గురించి ఉప్పలగుప్తం మత్స్యశాఖాధికారి గోపాలకృష్ణ వివరిస్తూ.. టెట్రాంటిడీ కుటుంబానికి చెందినదని… దీని శాస్త్రీయనామం టెట్రాడాన్ అని తెలిపారు. ఇది ప్రపంచంలో రెండో విషపూరితమైన చేపని, దీనిలో విషం మనిషిని చంపేంత ఉంటుందని తెలిపారు. అందుకే ఇలాంటి చేప మీకు ఎప్పుడైనా కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement