Monday, April 29, 2024

500అడుగులు వెన‌క్కి వెళ్లిన స‌ముద్రం.. భ‌యాందోళ‌నలో జ‌నం

స‌ముద్రం 500అడుగులు వెన‌క్కి వెళ్లింది .. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు నాగ‌ప‌ట్ట‌ణం జిల్లా వేదారణ్యంలో సముద్ర తీరంలో చోటు చేసుకుంది. తీరం నుంచి దాదాపు 500 అడుగుల మేర వెనక్కి తగ్గాయి. గత రెండు, మూడు రోజులుగా ఇలాగే జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తీరానికి దగ్గర్లో ఉంటున్న జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న ఆర్కాడుతురై నుంచి వేదారణ్యం సముద్రతీరం వరకు సుమారు 100 అడుగుల దూరం సముద్రం వెనక్కివెళ్లింది. ఈ నెల 12న కూడా కూడా సముద్రం వెనక్కివెళ్లింది. తాజాగా 500 అడుగులు వెనక్కి వెళ్లడంతో చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది. అయితే, మోఖా తుఫాను ప్రభావం వల్లే సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి మోఖా తుఫానుగా బలపడింది.తుఫాను ప్రభావంతో నాగపట్టణం జిల్లాలోని వేదారణ్యం, కొడియకరై, ఆర్కాడుతురై, పుష్పవనం, ఎల్లపల్లం తదితర గ్రామాల్లోని మత్స్యకారుల జీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో వారం రోజులుగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడంలేదు. దాదాపుగా ఐదు వేల మందికి పైగా మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement