ఒకే వేదికపై ఓ వ్యక్తి ముగ్గురు మహిళలని వివాహం చేసుకున్నాడు. కాగా ఈయనకి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. సదరు వ్యక్తి ఈ ముగ్గురు మహిళలతో 15ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ ని కొనసాగిస్తున్నాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్ లోని ట్రెబల్ తెగకు చెందిన సమర్థ్ మౌర్య (42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పాడినట్లు తెలిపాడు. ఆ తరువాత మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్ బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానకి కూడా మౌర్యను అనుమతించలేదని చెప్పారు..కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement