Tuesday, May 14, 2024

ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ ఆర్మీ ఆఫీస‌ర్ల‌కు సెల్యూట్‌.. పూలు చ‌ల్లుతూ.. నినాదాలు..

తమిళనాడు: కూనూర్ మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో చ‌నిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్‌ రావత్, అతని భార్య మ‌ధులిక రావ‌త్‌, ఇతర సిబ్బంది మృతదేహాలను సూలూర్ ఎయిర్ బేస్‌కు తీసుకొచ్చారు. అంబులెన్స్‌లో వారి మృత‌దేహాల‌ను తీసుకుని నీలగిరి జిల్లాలోని మద్రాసు రెజిమెంటల్ సెంటర్ నుండి సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరే స‌మ‌యంలో స్థానికులు పూల మాలలు వేసి ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేశారు. దారి పొడ‌వునా పూలు చ‌ల్లుతూ.. సెల్యూట్ చేస్తూ.. నినాదాలు చేస్తూ.. నివాళుల‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement