Wednesday, May 15, 2024

ఛ‌త్తీస్‌గఢ్ కి రండి – స‌ల్మాన్ కి – సీఎం పిలుపు

ఛ‌త్తీస్‌గఢ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు గౌర‌వ్ ద్వివేది ..బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని క‌లిశారు. చత్తీస్‌గఢ్ కొత్త ఫిల్మ్ పాలసీకి సంబంధించి సల్మాన్ ఖాన్‌తో ..ద్వివేది చ‌ర్చించారు. రాష్ట్రంలో సహజ ప్రదేశాలు ఉన్నందున ఇక్కడ షూటింగ్‌కి చాలా స్కోప్ ఉందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తో ఫోన్ లో మాట్లాడారు స‌ల్మాన్ ఖాన్. కాగా ఛత్తీస్‌గఢ్‌ను సందర్శించాల్సిందిగా సీఎం , స‌ల్మాన్ ఖాన్ ని ఆహ్వానించారు ..కాగా సల్మాన్ ఖాన్ ..బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్‌తో కలిసి ఢిల్లీలో టైగర్ 3 సినిమా షూటింగ్ లో ఉన్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న టైగర్‌ పార్ట్‌-3ని టర్కీ, రష్యా, ఆస్ట్రియా సహా పలు దేశాల్లో ప్రముఖంగా చిత్రీకరించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు. టైగర్ 3లో, సల్మాన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ అకా టైగర్‌గా కనిపించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement