Saturday, May 4, 2024

ల‌తామంగేష్క‌ర్ ని గుర్తు చేసుకుని భావోద్వేగాని గుర‌యిన ‘స‌ల్మాన్ ఖాన్’

దివంగ‌త సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర‌య్యాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. 1983లో రిలీజ్ అయిన వో జో హ‌సీనా చిత్రం నుండి రిలీజ్ అయిన ల‌గ్ జా గ‌లే సాంగ్ పాడుతూ భావోద్వేగానికి గుర‌య్యాడు. ‘నీలా ఏ ఒక్కరూ లేరు లతాజీ.. భవిష్యత్ లోనూ ఉండబోరు’ అంటూ లతా మంగేష్కర్ ను గుర్తు చేసుకున్నాడు. లతాజీ లేరనే చేదునిజాన్ని ఇప్పుడిప్పుడే సల్మాన్ జీర్ణించుకుంటున్నారు. కాగా లతా మంగేష్కర్ 29 రోజుల పాటు కరోనాతో పోరాడి.. ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ , షారుక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు భారతరత్న లతా జీకి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement