Tuesday, April 30, 2024

TSRTC గుడ్ న్యూస్.. ప్రయాణికులకు ఫ్రీ సర్వీస్

ప్రయాణీల‌కు ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ బస్‌ స్టేషన్(CBS) నుంచి MGBS వరకు ప్రయాణీకుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అందబాటులో ఉంటాయి. ప్రయాణీకులు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా వీటిలో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ వాహనాల్లో ఒకేసారి 12 మంది ప్రయాణించొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో వృద్దులకు, వికలాంగులకు, గర్భిణులకు, రోగులకు తొలి ప్రాధాన్యత ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు అనేక రాష్ట్రాలకు ఎంజీబీఎస్ నుంచి నిత్యం వేలాది ప్రయాణికులు వస్తుంటారు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రయాణీకులు ముందుగా సీబీఎస్‌లో సిటీ బస్సులు దిగి అక్కడి నుంచి రోడ్డు దాటి ఎంబీజీఎస్‌కు రావాల్సి ఉంటుంది. అయితే ఆ మార్గం నిత్యం రద్దీగా ఉంటుండటంతో లగేజీ, పిల్లలతో వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు దాటేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై టీఎస్ఆర్టీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్యను గుర్తించిన ఎండీ సజ్జనార్ దానికి పరిష్కార మార్గం చూపించారు. ఈ నేప‌థ్యంలో ఈ ఎలక్ట్రానిక్ వాహనాల ఫ్రీ స‌ర్వీస్‌ను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement