Friday, May 3, 2024

Flash.. Flash: కొత్తగూడెంలో దారుణం.. బొగ్గు టిప్పర్​, వ్యాను ఢీకొని ఇద్దరు కూలీలు మృతి..

కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బొగ్గు టిప్పర్, వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వారిని సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement