Monday, May 13, 2024

క‌రోనాతో మ‌ర‌ణించే ‘హెల్త్ వ‌ర్క‌ర్ల‌’కు రూ. 50ల‌క్ష‌లు – మంత్రి హ‌రీశ్ రావు

క‌రోనాతో మ‌ర‌ణించే హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు రూ. 50ల‌క్ష‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి హ‌రీశ్ రావు. కాగా సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లూకోమ డే వారోత్సవాలు జ‌రిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కరోనా స‌మ‌యంలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి రూ. 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ నను ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అందించారు. ప్రజలకు గ్లూకోమ గురించి అవగాహన కల్పించాలని… ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కొల్పొయే ప్రమాదం ఉంద‌ని … బిపి ,షుగర్ ఉన్న వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటి బిపి , షుగర్ ఉన్నవాళ్లలో 3 శాతం ఉందని.. సరోజినిదేవి కంటి ఆసుపత్రి పైన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ప్రపంచంలోనే కంటి వెలుగు లాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement