Monday, May 20, 2024

తగ్గిన కరోనా.. ఇండియాలో కొత్తగా 2678 కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భాగా తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా.. నిన్న 2,37,952 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,678 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,23,997కు చేరాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు కరోనాతో 10మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాకు బలైన వారి సంఖ్య 5,28,857కు చేరింది. ప్రస్తుతం దేశంలో 26,583 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement