Sunday, May 5, 2024

ఓ వ్య‌క్తి మ‌ల‌ద్వారంలో కిలో బంగారం-అదుపులోకి తీసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

ఓ వ్య‌క్తి మ‌ల‌ద్వారంలో కిలో బంగారం ఉన్న‌ట్లు గుర్తించారు క‌స్ట‌మ్స్ అధికారులు. విమానంలో ఖతర్ రాజధాని దోహా నుంచి కేరళలోని కొచ్చి చేరుకున్న ఓ వ్యక్తి నడక తేడాగా ఉండడంతో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడి మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు తేలింది. బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం 1066.75 గ్రాములున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు కోజికోడ్ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన అబ్దుల్ జలీల్‌గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement