Tuesday, April 30, 2024

ఉభ‌య తెలుగు రాష్ట్రాల న‌డుమ కృష్ణాన‌దిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి-ఆమోదం తెలిపిన కేంద్రం

ఉభ‌య తెలుగు రాష్ట్రాల న‌డుమ కృష్ణాన‌దిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. విశాలమైన శ్రీశైలం జలాశయానికి చేరువగా, నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఏపీ వైపున సంగమేశ్వర ఆలయంతో ఇదొక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement