Friday, April 26, 2024

ముగిసిన ‘ర‌మేశ్ బాబు’ అంత్య‌క్రియ‌లు

సూప‌ర్ స్టార్ కృష్ణ కుమారుడు ర‌మేశ్ బాబు అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానం శ్మ‌శాన‌వాటిక‌లో ముగిశాయి. ర‌మేశ్ బాబు భౌతిక‌కాయానికి ఆయ‌న కుమారుడు జ‌య‌కృష్ణ అంతిమ‌సంస్కారాలు నిర్వ‌హించారు. ర‌మేశ్ బాబు మృతితో సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం దిగ్భ్రాంతికి గుర‌యింది. కాగా, కరోనా సోకడంతో మహేశ్ బాబు తన సోదరుడిని కడసారి చూసేందుకు వీల్లేకపోయింది. మహేశ్ బాబు ఇంటి ముందు నుంచే అంతిమయాత్ర సాగింది. రమేశ్ బాబు కొంతకాలంగా లివర్ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement