Thursday, March 28, 2024

దీర్ఘకాలిక స్థలాలకు పట్టాలు పంపిణీ..

ముత్తుకూరు ప్ర‌భ‌న్యూస్ : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలకు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 22 కుటుంబాలకు ఇంటి నివేశన యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ పట్టాలు పంపిణీ తోపాటు విద్యుత్ మీటర్లు లబ్ధిదారులకు అందజేశారు.

ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎమ్మెల్యే కాకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దీర్ఘకాలికంగా నివాసం ఉంటున్న మా స్థలాలకు వైకాపా ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ పాలకులు, తాసిల్దార్ సోమ్లా నాయక్, విద్యుత్ శాఖ ఏఈ అక్బర్ ,గ్రామ రెవిన్యూ అధికారి జ్యోతి, సచివాలయం కన్వీనర్ చక్రం వెంకటేశ్వర్లు, ఎంపీపీ సుగుణ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement