Saturday, April 27, 2024

షెకావత్‌కు ఎంపీ రఘురామ లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతున్న వేళ.. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని లేఖలో కోరారు. ఇద్దరు శత్రువుల మధ్య వివాద పరిష్కారం సులువుగా చేయొచని, రెండు రాష్ట్రాల సీఎంలు మంచి మిత్రులు, వారి మధ్య వివాద పరిష్కారం అంత సులువు కాదన్నారు. వివాదం ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శ్రీశైలం డ్యామ్, విద్యుత్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలన్నారు. నీరు, విద్యుత్ పంపిణీ బాధ్యతలు కేంద్రం తీసుకోవాలని లేఖలో రఘురామ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement