Thursday, April 25, 2024

రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ ఒప్పుకున్నాడు: ఏఎస్పీ

పాల్వంచ:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావుపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేదని ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ తెలిపారు. ఈమేరకు కేసు వివరాలను ఈ రోజు ఆయన వెల్లడించారు. ‘‘రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి.

గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ జరుపుతాం. పలు అంశాలపై విచారించాం. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించాడు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేం. రాఘవ బాధితులు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు’’ అని  ఏఎస్పీ రోహిత్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement