Friday, April 26, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు స‌మావేశమయ్యారు. ఈ స‌మావేశంలో దేశంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌లు కార్య‌క్ర‌మాల నిమిత్తం ఇవాళ మ‌ధ్యాహ్నం సీఎం భ‌గ‌వంత్ మాన్ హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత పలువురు ప్రముఖులతో సమావేశమవుతున్నారు. అందులో భాగంగా ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పలు రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement