Monday, April 29, 2024

రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంక గాంధీ మద్దతు..

దేశ రాజధాని జంతర్ మంతర్ లో గత వారం రోజులుగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెజ్లర్ల నిరసనకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మద్ధతు తెలిపారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో నిన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement