Monday, April 29, 2024

కేంద్ర మంత్రి ఇంట్లో గ‌ణేశ్ పూజ‌-పాల్గొన్న ప్ర‌ధాని మోడీ

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ నివాసంలో జ‌రిగిన వినాయ‌క‌పూజ‌లో పాల్గొన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. వారింట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రధాని హారతి ఇచ్చారు. లేత పసుపు, కాషాయ రంగును పోలిన కుర్తా, తెల్లటి ధోవతిని ప్రధాని ధరించారు. కాషాయ రంగు అంగవస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. పూజలో పాల్గొనడానికి ముందు పీయూష్ గోయల్ నివాసం వద్దకు చేరుకున్న ప్రజలకు ప్రధాని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూజకు సంబంధించిన ఫొటోలను ప్రధాని స్వయంగా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘గణేశ్ చతుర్థి పర్వదినం నాడు నా సహచరుడు పీయూష్ గోయల్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లాను. భగవాన్ శ్రీ గణేశ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాల‌ని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement