Tuesday, May 7, 2024

దుబాయ్ ప్ర‌ధానికి షాక్ ఇచ్చిన లండ‌న్ కోర్టు : మాజీ భార్య‌కి భ‌ర‌ణం ఎన్ని కోట్లో తెలుసా

భార్య భ‌ర్త‌లు విడిపోయాక భార్య‌కి భ‌ర్త ఇచ్చే భ‌ర‌ణం ఎంత ఉంటుంది అంటే వారి వారి స్థోమ‌త‌ని బ‌ట్టి, వారి హోదాని బ‌ట్టి ఉంటుంది. అయితే ఇక్క‌డ ఏకంగా 5555కోట్ల భ‌ర‌ణం చెల్లించాల్సి వ‌చ్చిందా భ‌ర్త‌కి. మ‌రి ఆయ‌న ఏమ‌యినా సామాన్యుడా ఏకంగా దుబాయ్ కి ప్ర‌ధాని. ఆయ‌నే షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్త‌మ్. ఈ మేర‌కు ఈ భ‌ర‌ణాన్ని ఆయ‌న మాజీ భార్య‌, యువ‌రాణి హ‌యాబింట్ అల్ హుస్సేన్ కు చెల్లించాల్సిందేన‌ని లండ‌న్ హై కోర్టు తీర్పు ఇచ్చి షాక్ ఇచ్చింది. అంతే కాదు ముందుగా రూ. 2,516 కోట్లు చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. అలాగే మిగిలిన మొత్తాన్ని మూడు ద‌ఫాల‌లో చెల్లించాల‌ని ఆదేశించింది.

కోర్టు ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ఇద్ద‌రు పిల్ల‌ల‌కు వారి జీవితాంతం భ‌ద్ర‌తా ఖ‌ర్చుల‌ను భరించాల‌ని తెలిపింది. అల్ ముక్తూమ్ ఆరవ భార్య అయిన హ‌యా బింట్ అల్ హుస్సేన్ గ‌త కొద్ది రోజుల ముందు జ‌ర్మ‌నీ కి పారిపోయింది. అక్క‌డ నుంచి విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. జ‌ర్మ‌నీ దేశ ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించింది. అక్క‌డ నుంచి వీరి విడాకులు అయ్యాయి. కాగ ఈ విడాకులు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన విడాకులు గా ఉన్నాయి. గ‌తంలో చాలా మంది ప్ర‌ముఖులు విడాకులు తీసుకున్నారు. కానీ ఇంత మొత్తం భ‌ర‌ణం చెల్లించ‌లేదు. అందుకే ఇప్పుడు ఈ భ‌రణం వార్త వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement