Saturday, April 27, 2024

స‌లార్ అప్ డేట్ ఇస్తావా..చావ‌మంటావా-ప్ర‌భాస్ ఫ్యాన్ లెట‌ర్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ..పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న చిత్రంలో న‌టిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు. ఇటీవలే ఒక యువకుడు రాధేశ్యామ్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నదని సూసైడ్ చేసుకున్న విషయం విదితమే. తాజాగా మరో యువకుడు ‘సలార్’ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అని ప్రశాంత్ నీల్ కు లెటర్ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. “సినిమా మొదలై ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లేదు, ఒక గ్లింప్స్ లేదు.. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కనుక ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇలాగే ‘సాహో’ కు చేశారు, ‘రాధేశ్యామ్’ కి చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి అలాగే చేస్తారేమో అని భయమేస్తోంది. ఈసారి అలా జరగకూడదని కోరుకుంటున్నాం. మాకు సలార్ అప్డేట్ కావాలి” అంటూ ఆ సూసైడ్ లెటర్ లో రాసి ఉంది. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ లెటర్ చూసిన పోలీసులు యువకుడి డిటైల్స్ కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement