Sunday, April 28, 2024

Sai Dharam Tej: మెగాహీరోకు షాక్.. సాయితేజ్‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌!

మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్‌కు 91 సీర్పీసీ కింద నోటీసులు జారీ చేశామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్ల వివరాలు కోరామని చెప్పారు. అయితే నోటీసులకు తేజ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని, త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయబోతున్నామని వెల్లడించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌10న కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో సాయితేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి పడిపోయాడు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ యాక్సిడెంట్ విషయంలో సాయి ధరమ్ తేజ్‌పై కూడా పోలీసులు పలు సెక్లన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదంలో స్వల్ప గాయాలవడంతో తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement