Tuesday, April 30, 2024

Warning | గోసంరక్షణ పేరుతో దాడులు చేయొద్దు.. సీపీ ఆనంద్​ సీరియస్​ వార్నింగ్​

గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయన్నారు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌. జూన్ 27న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు. అక్రమ పశువుల రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ, జీహెచ్​ఎంసీ, ఇతర  అధికారులకు తెలియజేయాలన్నారు. దీన్ని సాకుగా చూపి ఎవరూ దాడులకు పాల్పడొద్దని సీపీ ​తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీసీసీసీ)లో జరిగిన ఇంటర్‌ డిపార్ట్ మెంట్‌ కో ఆర్డిరేషన్​ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పండుగ సీజన్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు సీపీ ఆనంద్​. పశుసంవర్ధక శాఖ, స్థానిక పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సమన్వయంగా నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పశువుల రవాణా, పశువుల వధ సమయంలో వర్తించే చట్టాల గురించి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement