Thursday, April 25, 2024

Police Case: ఎంత దారుణ‌మంటే.. మత్తుమందు ఇచ్చి అది కోసేసింది..

ఆమె ఒక యోగా టీచ‌ర్‌. ఆమెతో పాటు మ‌రో యోగా గురువు క‌లిసి ప‌నిచేస్తున్నాడు. అయితే వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఓ రోజు డిన్న‌ర్‌కని ఇంటికి పిలిచింది. అత‌ను తినే ఫుడ్‌లో మ‌త్తు మందు క‌లిపింది. ఆ త‌ర్వాత అత‌ని ప్రైవేట్ పార్ట్స్‌ని క‌త్తితో కోసేంది. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 16న మహిళా యోగా టీచర్.. తన సహోద్యోగిని డిన్నర్ కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో అతడికి మత్తు మందు ఇచ్చింది. స్పృహా కోల్పోయిన తర్వాత అతడి ప్రైవేట్ పార్ట్స్‌ని కత్తితో కోసేసింది. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేసరికి ఆ మహిళ కనిపించకుండా పోయిందని బాధితుడు తెలిపాడు.

వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ట్టు బాధితుడు తెలిపాడు. డిశ్చార్జి అయిన తర్వాత అతడు భాంక్రోటా పోలీసులల‌కు ఈ విష‌య‌మూ కంప్లేయింట్ చేయ‌డంతో ఈ విష‌యం కాస్త వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి య‌త్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement