Sunday, May 19, 2024

కారును ఢీ కొన్న పిక‌ప్ వ్యాన్-అమెరికాలో తానా బోర్డు స‌భ్యుడి ఫ్యామిలీ మెంబ‌ర్స్ మృతి

కారు యాక్సిడెంట్ లో అమెరికాలో నివ‌సిస్తోన్న తానా బోర్డు స‌భ్యుడు కొడాలి నాగేంద్ర భార్య‌..ఇద్ద‌రు కుమారైలు మృతి చెందారు. పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన శ్రీనివాస్‌ కుటుంబం హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. భార్య వాణి ఇద్దరు కుమార్తెలను కళాశాల నుంచి తీసుకువస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును వ్యాను వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామానికి చెందిన డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1995లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పిడీయాట్రిక్ కార్డియోవాస్య్కూలర్ అనస్థీషియనిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డాడు.

2017 నుంచి తానా బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్నాడు.ఇక నాగేంద్ర భార్య వాణి ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద అమ్మాయి వైద్యవిద్యను అభ్యసిస్తోంది. చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది. వీరు ఉదయం కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకువచ్చేందుకు కారులో వాణి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును పికప్ వ్యాన్ ఢీకొట్టింది. భార్య ఇద్దరు కుమార్తెల మరణంతో డా.నాగేంద్ర బోరుమన్నారు. ఆయనను ఆపడం ఎవరితరం కాలేదు. నాగేంద్ర షాక్ లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై తానా సభ్యులు శ్రీనివాస్ మిత్రులు సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కు ధైర్యం చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement