Monday, May 6, 2024

ఫిలిప్పీన్స్ లో రాయ్ తుఫాన్ బీభ‌త్సం : ‘ఒక‌రు మృతి’

రాయ్ తుఫాన్ ఫిలిప్పీన్స్ ను ముంచెత్తింది. ఈ తుఫాన్ ధాటికి ఒక‌రు మృతి చెందారు. వేలాది మంది ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వేరే ప్ర‌దేశాల‌కి త‌ర‌లిపోతున్నారు. కాగా ప్ర‌భుత్వం వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. విసాయా–పలావాన్ దీవుల మధ్య ఉన్న 8 ప్రాంతాల్లోని 3 లక్షల మందిని తరలించారు. టైఫూన్ తో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆహారం, నీళ్లు లేక జనం అలమటించారు. అయితే తుపాను తీవ్రత ఎక్కువగానే ఉన్నా ఇంతకుముందు వచ్చిన తుపాన్లతో పోలిస్తే రాయ్ తో కలిగే నష్టం తక్కువగానే ఉండొచ్చని అధికారులు తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న నెల పసికందును టబ్బులో పెట్టి అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం తుపానుతో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు.ఈ తుఫాన్ ప్ర‌భావంతో 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ ఏడాది 15 తుపాన్లు ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడగా.. ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపానును అమెరికా ‘సూపర్ టైఫూన్’గా అభివర్ణించింది. ‘రాయ్’ను ‘కేటగిరీ 5’ తుపానుగా ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యంత వేగంగా కదులుతున్న ఈ తుపాను ప్రస్తుతం బలహీనపడిందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement