Sunday, April 28, 2024

వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు

వాహనదారులకు చమరు సంస్థలు ఊరటనిచ్చాయి. గతంలో ప్రతిరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీ ఇంధన ధరలు ఈ రోజు కూడా నిలకడగానే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర రూ.105.54 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.96.99 వద్ద స్థిరంగా ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్ ధర నిలకడగా కొనసాగింది. రూ.107.37 వద్ద ఉండగా.. డీజిల్ రేటు కూడా రూ.98.36 వద్దనే స్థిరంగా ఉంది. దేశీ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగడం ఇది వరుసగా 7వ రోజు.

ఇది కూడా చదవండి: వాళ్లను పాకిస్థాన్ కి పంపిస్తాం: రాజాసింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement