Friday, April 19, 2024

వాళ్లను పాకిస్థాన్ కి పంపిస్తాం: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం పార్టీపై విరుచుకుపడ్డారు. పదునైన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఐఎం దొంగలను పాకిస్థాన్ కు పంపిస్తామని అన్నారు. మోదీ దెబ్బకు ఎంఐఎం నేతలు ఇప్పటికే జనగనమన పాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో ఛార్మినార్ వద్ద సభ పెట్టామని… ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని… అప్పుడు ఏం చేస్తారో ఎంఐఎం నేతలు ఇప్పుడే చెప్పాలని అన్నారు.

ఇది కూడా చదవండి: పన్నుల మోతలో ఏపీ నెంబర్ వన్ః దేవినేని ఉమా

Advertisement

తాజా వార్తలు

Advertisement