Friday, April 26, 2024

జిమ్ చేస్తుండ‌గా హార్ట్ ఎటాక్.. మృతి చెందిన వ్య‌క్తి

ఓ హోట‌ల్ య‌జ‌మాని జిమ్ చేస్తుండ‌గా హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించాడు.. ఈ సంఘట‌న ఇండోర్ లో చోటు చేసుకుంది.గోల్డ్ జిమ్‌లోహోటల్ బృందావన్ యజమాని ప్రదీప్ రఘువంశీ గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు రెగ్యూలర్ గా జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో చాలా సేపు గడిపేవారు .ఎప్పటిలాగే జిమ్ కు వెళ్లాడు. ట్రెడ్‌మిల్‌ పై నడిచాడు. తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ మరుక్షణమే చూస్తుండగానే.. నేల మీద కుప్పకూలాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న కొందరు యువకులు వెంటనే ప్రదీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 18న ప్రదీప్ కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రదీప్ జిమ్ లో వ్యాయమం చేస్తూ కుప్పకూలి చనిపోవడం.. ఇదంతా జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. జిమ్ చేసే వారు సైతం ఇలా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగించే అంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement