Monday, May 13, 2024

కేసీఆర్ కోలుకోవాలని పవన్ ప్రార్థన!

కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరట కలిగిస్తోందిన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్‌లో చేరినట్లు తెలిసిందని, ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.


ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడి తన ఫాంహౌస్ లో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ప్రస్తుతం కరోనా బారినపడ్డారు .తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడడంతో పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఇప్పటికే ట్వీట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నటుడు మహేష్ బాబు ,టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర రాజకీయ నాయకులు కూడా కరోనావైరస్ నుండి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement