Sunday, April 28, 2024

ప‌విత్ర‌లోకేష్ తో పెళ్ల‌యింది – అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తా – సుచేంద్ర‌

న‌టి..త‌న భార్య ప‌విత్ర లోకేష్ కి కాపురాలు కూల్చే అల‌వాటు ఉంద‌ని ఆమె భ‌ర్త సుచేంద్ర కామెంట్స్ చేసిన‌ట్లు క‌న్న‌డ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే సుచేంద్ర ఈ కామెంట్స్ ని నిజంగానే చేశారా లేక సృష్టించారా అనేది తెలియాల్సి ఉంది.కాగా సుచేంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం గతంలో వైరల్ అయిన కామెంట్స్ కి పూర్తి భిన్నంగా ఉన్నాయి. సుచేంద్ర తాజాగా మీడియా ముందు తన భార్య పవిత్రని వెనకేసుకొని వస్తూ పాజిటివ్ గా మాట్లాడారు. మైసూర్ లో హోటల్ సంఘటన జరగడం దురదృష్టకరం అని అన్నారు. ఆ సంఘటన తర్వాత పవిత్ర నాకు ఫోన్ చేసింది. ఏం జరిగిందో వివరించింది. తన భార్య తప్పు చేయదని, నాకు ఆ నమ్మకం ఉందని సుచేంద్ర ఊహించని కామెంట్స్ చేశారు.

అయితే పవిత్ర.. తమకి పెళ్లి కాలేదని ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. మా ఇద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇప్పటికి మేమిద్దరం భార్య భర్తలమే అని సుచేంద్ర అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంలోకి మా ఫ్యామిలీని లాగొద్దని.. మా పిల్లలకు ఈ విషయం తెలియదు అని సుచేంద్ర అన్నారు. రమ్యతో ఉన్న పవర్ టివి అధినేత రాకేష్ శెట్టి ఎవరో కూడా తనకు తెలియదు అని సుచేంద్ర క్లారిటీ ఇచ్చారు. అయితే పవిత్ర తమది సహజీవనం మాత్రమే అని ఎందుకు చెబుతోందో తెలియదు అని అన్నారు. హిందూ సంప్రదాయంలో జరిగే వివాహాల్లో ఎక్కువగా మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రస్తావన ఉండదు. కాబట్టి మా మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు. కానీ పెళ్ళికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని బయటపెడతా అని సుచేంద్ర అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement